స్టార్ హీరోయిన్ కరోనా తరువాత రెండు కొత్త అలవాట్లకు ప్రాధాన్యత నివ్వడం మొదలుపెట్టింది. అందులో ఒకటి మేడమీద టెర్రాస్ పై కూరగాయలు పెంచడం. రెండవది ఫిట్ నెస్ కోసం యోగా చేయడం. ఏది తప్పినా ఈ రెండింటిని మాత్రం క్రమం తప్పకుండా పాటిస్తోంది. తను పాటించడమే కాకుండా తనలా మరికొంత మంది పాటించాలని ఆ ఫొటోలని సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్లో పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల తన ఇంటి మేడపై వున్న టెర్రాస్పై కూరగాయలు పండిస్తూ ఆకట్టుకున్న సమంత తాజాగా ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
రోజు వారీ వ్యాయామాల్లో భాగంగా భారీ వర్కువుట్లు, భారీ వెయిట్ లిప్ట్లు చేసి అభిమానుల్ని ఆశ్చర్యపరిచిన సమంత తాజాగా ఓ డిఫికల్డ్ పోజ్ని ట్రై చేసి ఆ ఫొటోని సోషల్ మీడియాలో శుక్రవారం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా సామ్ యోగాసనాలపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ` యోగా అంటే తనకు చాలా ఇష్టమని, ఇంట్లో తనతో పాటు నాగచైతన్య కూడా చేస్తున్నాడని, అందుకే తనకు బోర్ కొట్టడం లేదని చెబుతోంది. లాక్డౌన్ దగ్గరి నుంచి చైతూతో కలిసి క్రమంతప్పకుండా సామ్ యోగాసనాలు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది.