సమంత హీరోయిన్ గా నటించిన యు టర్న్ చిత్రం ఈరోజు స్టార్ మా టెలివిజన్ లో ప్రసారం కానుంది . సమంత , ఆది , రాహుల్ , భూమిక చావ్లా ప్రధాన పాత్రలు పోషించిన యు టర్న్ చిత్రం గత ఏడాది దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే . యు టర్న్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది , మంచి విజయం కూడా సాధించింది . కన్నడంలో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు . పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీనివాస్ , రాంబాబు సంయుక్తంగా నిర్మించారు .
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన యు టర్న్ చిత్రం ఈరోజు స్టార్ మా లో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది . వరల్డ్ ప్రీమియర్ షో కావడంతో మంచి రేటింగ్ వస్తుందని భావిస్తున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు . యు టర్న్ సక్సెస్ తర్వాత తన భర్త నాగచైతన్య తో కలిసి నటించింది సమంత . మజిలీ చిత్రం కూడా ఓ మజిలీగా నిలిచిపోయింది సమంత – నాగచైతన్య కెరీర్ లో .