Homeటాప్ స్టోరీస్ఏడవడానికి సిద్దమైపోమంటున్న సమంత

ఏడవడానికి సిద్దమైపోమంటున్న సమంత

ఏడవడానికి సిద్దమైపోమంటున్న సమంత
ఏడవడానికి సిద్దమైపోమంటున్న సమంత

సమంత.. తెలుగు ఇండస్ట్రీలో హీరోలతో సమానమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నాయిక. పెళ్ళైన దగ్గరనుండి చాలా స్పెషల్ సినిమాలు మాత్రమే చేస్తోంది. గతేడాది ఓ బేబీ చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసిన సామ్.. ఈ ఏడాది జాను చిత్రంతో మన ముందుకు వస్తోంది. ఈ సినిమా తన కెరీర్ లో చాలా స్పెషల్ చిత్రమని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో మ్యాజిక్ జరిగిందని, చాలా స్పెషల్ గా అనిపించిందని, రేపు థియేటర్లలో దాన్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారని తెలిపింది ఆమె. మొదట ఈ చిత్రాన్ని తాను చేయకూడదని అనుకున్నానని, అలాంటి క్లాసిక్ లో నటించడం రిస్క్ అనిపించిందని, అయితే దిల్ రాజు తనను కన్విన్స్ చేసాడని, ఇలాంటి సినిమాను ఇచ్చినందుకు చాలా థాంక్స్ అని, దిల్ రాజుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పింది.

అలాగే జాను చిత్రం ఎప్పటికీ తన టాప్ 3 సినిమాలలో ఒకటిగా నిలిచిపోతుందని తెలిపింది. దేవుడికి కృతఙ్ఞతలు చెప్పాలి. ప్రతీ ఏడాది తన హార్ట్ ను టచ్ చేసే సినిమా ఒక్కటైనా ఇస్తున్నాడు. ఈ ఏడాది జాను అలాంటి చిత్రమే. గ్లిజరిన్ అవసరం లేకుండా షూట్ చేసేటప్పుడు ఏడ్చేసాను. పది టేక్ లు చేస్తే పది టేక్ లకు కూడా గ్లిజరిన్ అవసరం రాలేదు. అంత ఎమోషనల్ గా అనిపించింది. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఒరిజినల్ చూసిన వాళ్లకు కూడా ఈ సినిమా చాలా స్పెషల్ ఫీల్ కలిగిస్తుందని తెలిపింది సమంత. ఎలాంటి వ్యక్తినైనా కదిలించే గొప్ప సినిమా ఇదని, కచ్చితంగా కర్చీఫ్ లు తెచ్చుకోవాలని ఆమె సినిమాకు హైప్ ఇచ్చింది. శర్వానంద్ తో తాను పదేళ్లలో ఒక్క సినిమా కూడా చేయలేదని, అయితే జానుకు మించిన సినిమా అతనితో చేయడానికి మరొకటి దొరకదని తెలిపింది.

- Advertisement -

జాను ఫిబ్రవరి 7న విడుదల కానున్న సంగతి తెల్సిందే. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోవింద వసంత సంగీతాన్ని అందించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All