Homeటాప్ స్టోరీస్సామ్ మ‌ళ్లీ 3500 మెట్లెక్కేసిందిగా!

సామ్ మ‌ళ్లీ 3500 మెట్లెక్కేసిందిగా!

Samantha climbs 3500 steps again
Samantha climbs 3500 steps again

గ‌త ఏడాది కాలిన‌డ‌క‌న మెట్లెక్కుతూ తిరుపతి కొండ‌పైకి ఎక్కి స్వామివారిని ద‌ర్శించుకుని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది స‌మంత. ఈ ఏడాది కూడా అదే ప‌ని చేసింది. త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి చాలా రోజుల త‌రువాత న‌టించిన `మ‌జిలీ` రిలీజ్ స‌మ‌యంలో కాలిన‌డ‌క‌న ఏడుకొండ‌లెక్కిన సామ్ ఈ సారి త‌న స్నేహితురాలు ర‌మ్య సుబ్ర‌హ్మ‌ణియ‌న్‌తో క‌లిసి తిరుమ‌ల కొండ‌పైకి 3500 మెట్లెక్కడం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

`న‌వ్వుకుంటూ ప్ర‌శాంతంగా కొడ‌పైకి న‌డుచుకుంటూ వెళ్లి తిరుప‌తిలో స్వామివారిని ద‌ర్శించుకున్నాం. ఈ పాద‌యాత్ర‌తో ఈ ఏడాదికి గొప్ప ముగింపును ప‌లికి 2020కి శుభారంభాన్నిచ్చాం. లార్డ్ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆశీస్సులు అందుకోవ‌డంలో నా పార్ట్న‌ర్ స‌మంత ఎప్పుడూ నాకు తోడుగా వుంటోంది` అని స‌మంత స్నేహితురాలు ర‌మ్య‌సుబ్ర‌హ్మ‌ణియ‌న్ సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించింది. స‌మంత ఈ ఏడాది తెలుగులో మ‌జిలి, ఓ బేబీ, త‌మిళంలో `సూప‌ర్ డీల‌క్స్` వంటి డీసెంట్ హిట్‌ల‌ని సొంతం చేసుకుంది.

- Advertisement -

వ‌చ్చే సంవ‌త్స‌రం 96 రీమేక్‌తో పాటు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది. ఈ రెండు కూడా స‌మంత‌కు మంచి విజ‌యాల్ని అందిస్తాయ‌న్న కాన్ఫిడెంట్‌తో వుంది. దిల్ రాజు నిర్మిస్తున్న 96 చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. వెబ్‌సిరీస్ కూడా ఈ మ‌ధ్య‌నే మొద‌లైంది. వెబ్ సిరీస్‌తో స‌మంత బాలీవుడ్‌కు వెళుతోంది. ఇదే కాకుండా `పింక్‌` తెలుగు రీమేక్ కోసం స‌మంత‌ని చిత్ర బృందం సంప్ర‌దిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All