టాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా క్రేజ్ని సొంతం చేసుకున్నారు పూజా హెగ్డే, సమంత. ఈ ఇద్దరి మధ్య ఆన్లైన్ వార్ నడుస్తోంది. ఇటీవల గత రెండు రోజుల క్రితం తన ఇన్స్టా గ్రామ్ పేజ్ హ్యాక్ అయ్యిందని, ఇందులో పెట్టే పోస్ట్లకు స్పందించొద్దంటూ వెల్లడించడం.. ఆతరువాత గంట వ్యవధిలోనే తన టెక్నికల్ టీమ్ తన పేజీని తిరిగి సాధించారని పూజా హెగ్డే వెల్లడించింది.
అయితే హ్యాక్కి గురైన సందర్భంగాలో సమంతపై అసభ్యంగా పోస్ట్లు షేర్ కావడం సామ్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో రంగంలోకి దిగిన ఫ్యాన్స్ పూజా హెగ్డేని ఆడుకోవడం మొదలుపెట్టారు. అసభ్యకరమైన మీమ్స్తో సామ్ ఫ్యాన్స్ రచ్చ చేయడం ఇప్పడు హాట్ టాపిక్గా మారింది. గంటలో హ్యాకర్స్ నుంచి ఇన్ స్టాపేజ్ని తిరిగి పొందడం అన్నది కట్టుకథ అని, పూజా కావాలనే ఇలా చేస్తోందని సామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పూజని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
దీంతో ట్విట్టర్లో #WeSupportPoojaHegde, #PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్గా మారాయి. ఇలా ఇద్దరు స్టార్ హీరోయిన్ల ఫ్యాన్స్ ఆన్లైన్లో వార్ డిక్లేర్ చేసి రచ్చకు దిగడం టాలీవుడ్ హిస్టరీలో ఇదే తొలిసారి కావడంతో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పూజా హెగ్డే, సమంత ఎలా స్పందిస్తారో చూడాలి.