‘దబాంగ్’ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ పై సంచలన ఆరోపణలు చేయడం బాలీవుడ్ లో కొత్త చర్చకు దారితీస్తోంది. ‘దబాంగ్’ సినిమా తరువాత సల్మాన్ ఫ్యామిలీ తన కెరీర్ ని నాశనం చేశారని, తన జీవితాన్ని చిన్నా భిన్నం చేసిన శత్రువులు వారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అభినవ్ కాశ్యప్ చేసిన ఆరోపణలు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై సల్మాన్ ఫాదర్ సలీమ్ ఖాన్ స్పందించారు. ఒకరిపై ఆరోపణలు చేసేముందు ఆలోచించి చేయాలన్నారు. అభినవ్ ఆ పద్దతిని పాటించలేదని, అతని మాటలపై స్పందించడం సమయం వృధా అని కొట్టి పారేశారు.
యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నేపాటిజం వల్లే చనిపోయాడని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏంజరిగిందన్నది మాత్రం ఎవరూ క్లియర్ gaa వెల్లడించడం లేదు. దీంతో సుశాంత్ మరణం పై పలువురు ఎవరికీ తోచినట్టు వారు ఆరోపణలు చేస్తుండటం కలకలం రేపుతోంది.
- Advertisement -