Homeటాప్ స్టోరీస్విలన్ పాత్రలపై మనసు పారేసుకున్న మెగా మేనల్లుడు

విలన్ పాత్రలపై మనసు పారేసుకున్న మెగా మేనల్లుడు

విలన్ పాత్రలపై మనసు పారేసుకున్న మెగా మేనల్లుడు
విలన్ పాత్రలపై మనసు పారేసుకున్న మెగా మేనల్లుడు

ఒక్కోసారి హీరో వేషాల కన్నా విలన్ పాత్రలు భలేగా వర్కౌట్ అవుతాయి. అందుకే చాలా మంది హీరోలు కెరీర్ లో ఒక్కసారి అయినా విలన్ గా కానీ కనీసం గ్రే షేడ్స్ ఉన్న పాత్రను కానీ చేయాలనుకుంటారు. ఇప్పుడు ప్రతిరోజూ పండగే చిత్ర విజయంతో మంచి ఊపు మీదున్న సాయి తేజ్ కూడా తనకు విలన్ వేషాలు వేయాలనుందని చెప్పుకొచ్చాడు. కాకపోతే విలన్ గా సిల్వర్ స్క్రీన్ పై కాదట. తనకు ఏదైనా వెబ్ సిరీస్ లో విలన్ గా కానీ నెగటివ్ ఛాయలున్న పాత్ర కానీ పోషించాలని ఉందని ఇటీవలే ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన సందర్భంగా చెప్పుకొచ్చాడు. చాలా మంది నటీనటులు ఇప్పుడు వెబ్ సిరీస్ లకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించారు. ఆ కోవలోకే వెళ్ళాడు సాయి తేజ్.

అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో ఉన్న వివాదానికి కూడా ముగింపు పలికాడు. ఆ మధ్య ‘చెప్పను బ్రదర్’కు వ్యతిరేకంగా ‘ఆపలేను బ్రదర్’ అని స్టేజ్ పై కామెంట్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు నెగటివ్ అయిన తేజ్ ఇప్పుడు ‘అలాంటివి ఆపేసాను బ్రదర్’ అని చెప్పి వాళ్లకు దగ్గరయ్యాడు.

- Advertisement -

మల్టీస్టారర్స్, రీమేక్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. వరుణ్ తేజ్ తో మల్టీస్టారర్ కు ఎప్పటినుండో రెడీగా ఉన్నానని చెప్పాడు తేజ్. ఇక రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చేయాల్సి వస్తే అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితేనే చేస్తాడట. సాధారణంగా తాను రీమేక్స్ కు వ్యతిరేకం కాదని, అయితేనే చిరంజీవి నటించిన సినిమాలను మాత్రం కచ్చితంగా రీమేక్ చేయనని చెప్పేసాడు. ఒకవేళ కచ్చితంగా చేయాల్సి వస్తే కనుక చంటబ్బాయి రీమేక్ చేస్తానని రివీల్ చేసాడు.

ప్రతిరోజూ పండగే సూపర్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ చిత్ర విజయంతో మళ్ళీ తేజ్ బాగా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. తన తర్వాతి చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ రేపటి నుండి మొదలుకానుంది. సుబ్బు అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ ఏడాది దేవా కట్టతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు తేజ్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All