పడిపడి లేచె మనసు చిత్రం ప్లాప్ అయి నిర్మాతకు నష్టాలను మిగల్చడంతో ఖంగుతిన్న సాయి పల్లవి తన రెమ్యునరేషన్ లో సగ భాగాన్ని తిరిగి ఇచ్చేసిందట ! ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ సర్కిల్లో వైరల్ గా మారింది . సాయి పల్లవి – శర్వానంద్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ” పడిపడి లేచె మనసు ”. గత నెలలో విడుదలైన ఈ చిత్రం పై శర్వా తో పాటుగా సాయి పల్లవి హను రాఘవపూడి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు .
అయితే సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది . కేవలం 8 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది అంటే ఈ సినిమా ఎంత దారుణ పరాజయం పొందిందో అర్ధం చేసుకోవచ్చు . దాంతో షాక్ అయిన సాయి పల్లవి నిర్మాతకు ఇబ్బంది కలగకుండా తన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చేసిందట . ఫిదా చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సాయి పల్లవి ఇలా పెద్ద మనసు చాటుకుంది . హీరోలు మాత్రమే స్పందించే ఈరోజుల్లో నేను సైతం అంటూ ముందడుగు వేసింది సాయి పల్లవి .
English Title: Sai pallavi returned her remuneration to producer