ఫిదా మూవీ తో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి తాజాగా కూలీగా మారి అందర్నీ ఆశ్చర్య పరిచింది. తెలుగు లో మొదటి సినిమాతోనే యావత్ యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొని …వరుస ఛాన్సులు కొట్టేసింది. రీసెంట్ గా లవ్ స్టోరీ , శ్యామ్ సింగ రాయ్ తో వరుస హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈమె రానా సరసన నటించిన విరాట పర్వం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉండగా..ఈమె ఉగాది రోజున కూలీగా మారిపోయింది. తనకున్న స్టార్ స్టేటస్ ని పక్కనబెట్టి కచ్చా కట్టి..నెత్తిపై చెంగేసి పొలం మట్టిలోకి దిగింది. మిగతా కూలీలతో కలిసి పాటలు పాడుతూ పొలం పనుల్ని ముగించింది. వాటికి సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టా వేదికగా పంచుకుంది. వాటిని చూసి అభిమానలు పల్లవి పై ప్రశంసల వర్షం కురిపించారు. “సాయి పల్లవి నీలా ఎవరు ఉండలేరని“ మరో నటి శ్రద్ధా శ్రీనాద్ పోస్ట్ చేసింది.