ఎన్టీఆర్ బయోపిక్ మయా క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ అయ్యింది , మేకింగ్ ఖర్చు దాదాపు 70 కోట్ల వరకు అవుతుండగా రిలీజ్ కి ముందే భారీ లాభాలు తెచ్చిపెట్టేలా ఉంది ఎందుకంటే ఇప్పటికే వంద కోట్ల బిజినెస్ దాటిపోయింది ఇక రిలీజ్ నాటికి అన్ని హక్కులు కలుపుకొని 150 కోట్ల వరకు చేరినా ఆశ్చర్యం లేదు దాంతో మొదటి నుండి ఎన్టీఆర్ బయోపిక్ కు అండగా ఉన్న నిర్మాతలు సాయి కొర్రపాటి , విష్ణు లను తీసేయాలని తెరవెనుక ఓ పెద్ద మనిషి పెద్ద ప్రయత్నమే చేస్తున్నాడట . అసలు ఎన్టీఆర్ బయోపిక్ తెరమీదకు రావడానికి ముఖ్య కారకులు విష్ణు – సాయి కొర్రపాటి .
కానీ వాళ్ళు ప్రారంభించాలనుకున్న సినిమాలో బాలయ్యే నిర్మాత అయ్యాడు దాంతో వాళ్ళు స్వల్ప పెట్టుబడి మాత్రమే పెట్టారట ! మిగతాదంతా బాలయ్యే పెట్టాడు , పెడుతున్నాడు ఎందుకంటే నాన్న గారి బయోపిక్ కాబట్టి . అయితే తేజ దర్శకుడిగా అనుకున్నప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కు అంతగా క్రేజ్ రాలేదు ఎప్పుడైతే క్రిష్ దర్శకుడిగా కాలు పెట్టాడో అప్పటి నుండి ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ పెరిగింది . దానికి తోడు పలువురు నటీనటులు ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుండటంతో ఇప్పుడు హాట్ కేక్ అయ్యింది . దాంతో భారీగా లాభాలు వస్తున్న సినిమాకు స్వల్ప పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఎందుకు లాభాలు ఇవ్వాలని అనుకున్నారేమో కానీ వాళ్ళని బయోపిక్ నుండి తీసేయాలని ప్లాన్ చేస్తున్నారట .
English Title: sai korrapati and vishnu facing problems with ntr biopic