మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సెప్టెంబర్ 10న హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ మీద బైక్ స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. నెల రోజులు పైగా అపోలో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకున్న సాయి ధరం తేజ్ ప్రస్తుతం అంతా సెట్ రైట్ అయినట్టు తెలుస్తుంది. అయితే తను చేయాల్సిన సినిమాలన్ని 2022 కి వాయిదా వేయగా రీసెంట్ గా రిలీజైన రిపబ్లిక్ డిజిటల్ రిలీజ్ ఈవెంట్ కు సాయి ధరం తేజ్ ప్రమోషన్స్ చేయనున్నారట.
దేవా కట్ట డైరక్షన్ లో వచ్చిన రిపబ్లిక్ సినిమా థియేటర్ రిలీజ్ టైం లో సాయి ధరం తేజ్ హాస్పిటల్ లోనే ఉన్నాడు. అయితే నవంబర్ 25న ఈ సినిమా జీ 5లో డిజిటల్ రిలీజ్ అవుతుంది. అందుకే సినిమాని డిజిటల్ రిలీజ్ టైం లో ప్రమోట్ చేస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత సాయి ధారం తేజ్ మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి.
సినిమా ప్రమోషన్స్ తో పాటుగా ఆరోజు యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్న దాని మీద కూడా సాయి ధరం తేజ్ వివరణ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.