చిత్రలహరి సినిమాతో ఇటీవలే డీసెంట్ హిట్ అందుకుని మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు సాయి తేజ్. అదే ఊపును కొనసాగించాలనే ఉద్దేశంతో డిఫెరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే అనే సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరో మూడు నెలల్లో పూర్తి కానుంది.
దీని తర్వాత తేజ్ రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి సుబ్బు అనే నూతన దర్శకుడిని పరిచయం చేసేది కాగా, రెండోది టాలెంటెడ్ దర్శకుడు దేవకట్టాతో ఉంటుంది. ఇందులో ఏది ముందు మొదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు. దేవకట్టా సినిమాకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రవీణ్ సత్తారుతో కలిసి బాహుబలి వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన దేవాకట్టా అది పూర్తవ్వడంతో తేజ్ సినిమాపై దృష్టి పెట్టాడు. మొత్తంగా ఈ మూడు ప్రాజెక్టులతో తిరిగి పూర్తిగా ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నాడు తేజ్.