మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `రిపబ్లిక్`. దేవా కట్టా రూపొందిస్తున్నారు. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై జె. భగవాన్. జె. పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాలపై దేవా కట్టా, సాయిధరమ్తేజ్ సంధిస్తున్న వ్యంగ్యాస్త్రంగా ఈ మూవీని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.
చాలా రోజుల క్రితమే ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. తాజాగా గురువారం సాయిధరమ్తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో మెగా పవర్స్టార్ రామ్చరణ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. `పోస్టర్ బాగుంది. ప్రియమైన సోదరుడు సాయిధరమ్తేజ్కి, దర్శకుడు దేవా కట్టా అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్` అని టీమ్కి శుభాకాంక్షలు అందజేశారు రామ్చరణ్.
ఫస్ట్ లుక్ పోస్టర్లో సాయిధరమ్తేజ్ స్కెచ్ కనిపిస్తోంది. ఫేస్కి పెట్టుకున్న సన్ గ్లాసెస్లో రెండు గ్రూపుల మధ్య సాధారణ ఓటరు కనిపిస్తున్నాడు. దీనికి ఓ పవర్ఫుల్ క్యాప్షన్ ని ఉంచారు. `డెబ్బై నాలుగేళ్లుగా ప్రభుత్వం వుందన్న భ్రమలో బతుకుతున్నాం. కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా వుంటుందో కూడా తెలీదు` అంటూ సమకాలీన ప్రభుత్వాలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నా ఈ పొలిటికల్ థ్రిల్లర్ని జూన్ 4న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు.