సైబర్ నేరాలు గత కొంత కాలంగా వణుకు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలీ కాలంలో ఫేస్ బుక్, వాట్సాప్ నేరాలు కూడా మొదలయ్యాయి. ఒకరి పేరుతో మరొకరికి వాట్సాప్ లింక్స్ పంపిస్తూ మీరు డబ్బు కట్టాలని కొంత మంది. మరొకరి డీపీతో డబ్బులు వసూలు చేసే మోసాలు మరికొన్ని తాజాగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ పేరుని వాడుకుని ఓ ప్రబుద్ధుడు డబ్బులు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
దీన్ని ముందే గ్రహించిన సాయిధరమ్తేజ్ తన పేరుతో ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడని, ఇలాంటి మోసగాళ్లతో అంతా జాగ్రత్తగా వుండాలని, అప్రమత్తంగా వుండాలని సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ని పోస్ట్ చేశారు. తన పేరుతో వాట్సాప్ వేదికగా జరుగుతున్న మోసాన్ని స్క్రీన్ షాట్లతో సహా బయటపెట్టడం ఆసక్తికరంగా మారింది.
`ఇక వ్యక్తి నాలా మారి నాకు మనీ అవసరం వున్నట్టుగా మరో వ్యక్తిని డబ్బులు అడుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. దీనిపై నా తరుపున నేను లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను. ఇలాంటి వాటి నుంచి అందరూ అవగాహనతో వుండాలి. ఇలాంటి చాట్లకు దూరంగా వుండండి` అని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా హీరో సాయిధరమ్తేజ్ వెల్లడించారు. సాయిధరమ్తేజ్ ప్రస్తుతం `రిపబ్లిక్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
PLEASE BE CAREFUL !!! ???????? pic.twitter.com/KMGqR3Z6xY
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 30, 2021