Homeటాప్ స్టోరీస్సాక్ష్యం నష్టం ఎంత

సాక్ష్యం నష్టం ఎంత

saakshyam movie towards huge loss బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం చిత్రం ఈనెల 27న విడుదలైన విషయం తెలిసిందే . అయితే మొదటి రోజున సకాలంలో సినిమా విడుదల కాలేదు దాంతో కొన్ని చోట్ల మధ్యాహ్నం మరికొన్ని చోట్ల సాయంత్రం విడుదల అయ్యింది మొత్తానికి ఈ సినిమాకు రిలీస్ రోజే పయావరేజ్ టాక్ వచ్చింది . ఫస్టాఫ్ బాగానే ఉన్నపటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి మొత్తం తేలిపోయింది . ఇక మూడు రోజుల్లో ఈ సినిమా 9 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది . 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి భారీ నష్టాలు వచ్చేలా తప్పడం లేదు .

శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సాక్ష్యం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటించగా కీలక పాత్రలో జగపతిబాబు నటించాడు . ఇక ఈ సినిమా 40 కోట్లతో రూపొందగా శాటిలైట్ రూపంలో 8 కోట్లు హిందీ సాటిలైట్ రూపంలో 5 కోట్లు మొత్తంగా 13 కోట్లు వచ్చాయి . ఇక డిజిటల్ రైట్స్ రూపంలో కొంత మొత్తం రానుంది , అంటే 15 వస్తే ఎక్కువే ఇక ఏరియాల వారీగా మంచి బిజినెస్ జరిగింది కానీ వసూళ్లు మాత్రం అంత సంతృప్తికరంగా లేవు . ఈరోజు సోమవారం కాబట్టి అసలు పరీక్ష సాక్ష్యం ఈరోజు మొదలు కానుంది . బెల్లంకొండ కు లక్ ఏంటంటే …… …. సాక్ష్యం సినిమా నే కాస్త బాగుంది మిగతా సినిమాలు ఏవి కూడా బాగా లేవు కాబట్టి ఈ వారం రోజులు ఎంత లాగిస్తే అంత మంచిది . కానీ ఓవరాల్ గా మాత్రం నష్టం తప్పడం లేదు అయితే ఆ నష్టం ఎంత అన్నది మరో వారం తర్వాతే తేలిపోనుంది .

- Advertisement -

English Title: saakshyam movie towards huge loss

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All