అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో చిత్రం నుండి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ , లాయ్ , ఎహసన్ తప్పుకున్నారు . అయితే వాళ్ళు ఎందుకు తప్పుకున్నారో తెలియక అయోమయం నెలకొంది దాంతో మేమెందుకు సాహో నుండి తప్పుకోవాల్సి వచ్చిందో ఆ కారణం చెబుతా అంటూ అసలు విషయాన్నీ రివీల్ చేసాడు సంగీత దర్శకులలో ఒకరైన శంకర్ మహదేవన్ .
సాహో కు మేమే పాటలు అందించాలని అనుకున్నాం అలాగే నేపథ్య సంగీతం కూడా కానీ సాహో మేకర్స్ మాత్రం బయటి సంగీత దర్శకులతో మరికొన్ని పాటలను చేయించాలని ఫిక్స్ అయ్యారు అది మాకు నచ్చలేదు . మేము ముగ్గురం కూడా విభిన్న పాటలకు సంగీతం అందించాం అలాంటిది మాకు అవమానంగా అనిపించింది అందుకే సాహో నుండి తప్పుకోవాల్సి వచ్చింది అంటూ అసలు విషయాన్నీ చెప్పాడు శంకర్ మహదేవన్ . సాహో చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయాలనీ అనుకుంటున్నారు . ఇలాంటి సమయంలో వాళ్ళు తప్పుకోవడం అంటే సకాలంలో సినిమా రిలీజ్ అవుతుందా ? అన్నది పెద్ద ప్రశ్నే !