కార్తికేయ హీరోగా అందాలభామ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఆర్ ఎక్స్ 100″. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎక్సిబిటర్స్ కి కాసుల పంట కురించింది ఈ చిత్రం. సరిగ్గా ఈ చిత్రం విడుదలై నేటికి సంవత్సరం అయింది. అయినా మొన్ననే ఈ చిత్రం విడుదలైందా అనిపిస్తోంది. దానికి కారణం ఈ చిత్రంలోని పాటలు. ట్యూన్ మొయిన్ స్వరపరిచిన ‘మబ్భులోన వనవిల్లులా.. మట్టిలోనే నీటిజల్లులా‘ పాట సంగీత ప్రియులను ఎంత గానో ఆకట్టు కుంది. అజయ్ భూపతి టేకింగ్ సినిమాకి వన్ అఫ్ ది హైలెట్ గా నిలిచింది!!
- Advertisement -