యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాలో అనారోగ్య బారిన పడ్డాడని , క్షేమంగా లేదని ఓ వెబ్ సైట్ లో అస్తమానం ప్రచారం చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు కంగారు పడ్డారు అయితే ఆ వార్తలు నిజమేనా అని కనుక్కోవడానికి ప్రయతించినప్పుడు అవన్నీ ఉట్టి గాలి వార్తలే అని కేవలం సెన్సేషన్ కోసం ఇలా ఎన్టీఆర్ పై పుకార్ల ని ప్రచారం చేసారని ఎన్టీఆర్ పిఆర్ ఓ చెబుతున్నాడు . ఇంతకుముందు కూడా కొన్ని యు ట్యూబ్ ఛానల్ వాళ్ళు అదేపనిగా సంచలనం కోసం రేటింగ్ కోసం లేని విషయాలను ఉన్నట్లుగా ప్రచారం చేయడం కామన్ అయిపొయింది .
త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్ , ఆ చిత్రాన్ని కంప్లీట్ చేసి రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి సమాయత్తం అవుతున్నాడు . అయితే ఎన్టీఆర్ క్షేమంగా ఉన్నాడని తెలుసుకొని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు .