యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “ఆర్ఆర్ఆర్”. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడుతూ ఎట్టకేలకు ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా అందుతోన్న సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీమియర్ షో యూకేలోని ఓడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ థియేటర్లో ప్రదర్శిచం కానుందని సమాచారం. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్గా ఈ థియేటర్కు పేరుండడం విశేషం. అంతేకాదు ఒక్క యూకేలోనే ఆర్ఆర్ఆర్ ఏకంగా వెయ్యికిపైగా స్క్రీన్స్లో విడుదల కాబోతుంది. అంటే ఈ సినిమా కు ఎంత క్రేజ్ ఉందొ అర్ధమవుతుంది. మరి విడుదలకు ముందు ఎన్నో రికార్డ్స్ నెలకొల్పుతున్న ఈ మూవీ ..విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో అని అంత లెక్కలు వేసుకుంటున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించారు. అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లు. స్వాతంత్ర్య పోరాట కాలంలో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్లు కలుసుకుంటే ఎలా ఉంటుందనే బ్యాక్డ్రాప్తో ఈ మూవీ తెరకెక్కింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్లు కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేశారనే ఫిక్షనల్ స్టోరీతో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. డివివి దానయ్య దాదాపు రూ.400 కోట్లతో సినిమాను నిర్మించారు.