పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ మరికొద్ది సేపట్లో థియేటర్స్ లలో సందడి చేయబోతుంది. ఓవర్సీస్ తో పాటు చాల చోట్ల బినెఫిట్ షోస్ , అదనపు షోస్ పడుతుండగా..ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ ఛాన్స్ లేకుండా చేసారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాజకీయంగా తనకు పవన్ కళ్యాణ్ అడ్డు వస్తున్నాడనే కోపం తో పవన్ సినిమాల ఫై పగ పెంచుకున్నాడు. ఈ తరుణంలో భీమ్లా నాయక్ బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వకపోగా..టికెట్స్ ధరలు పెంచుకునే ఛాన్స్ కూడా లేకుండా చేసారు. ఆలా ఎవరైన చేస్తే థియేటర్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఈ క్రమంలో వైస్సార్సీపీ ఎంపీ రఘురామరాజు నిరసన వ్యక్తం చేస్తూ మోడీకి లేఖ రాసారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల వేలాది మంది కళాకారులు, వారి కుటుంబాల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి అని లేఖలో రఘురామ రాజు తెలిపారు. కరోనా పరిస్థితుల తర్వాత తెలుగు సినిమా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఓటీటీలు, పైరసీలతో తెలుగు సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిర్మాతలు భారీ బడ్జెట్తో దేశం గర్వించే విధంగా సినిమాలను రూపొందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. వ్యక్తిగత కక్షతో పవన్ కల్యాణ్ను సీఎం జగన్ టార్గెట్ చేస్తుంటే కనీసం సినిమా పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం లేదు.
ఒక సినిమా పరిశ్రమలో ఉండి.. తొటి నటుడికి అన్యాయం జరుగుతుంటే నోర్లు మూసుకొని ఉన్నారు అని రఘురామరాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి దారుణాలపై ఓ ఒక్కరు ప్రశ్నించడం లేదు సినిమా ప్రముఖులకు సిగ్గులేదా అని రఘురామరాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ప్రాధేయపడటం కాదు.. సినిమాల్లో మీరు కొడితే వందమంది లేచిపోతారు. అలాంటి స్టామినా ఉన్న మీరు ప్రభుత్వంపై దెబ్బ కొట్టండి అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రఘురామా లేఖ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పవన్ అభిమానులు సైతం రఘురామరాజు కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.