Homeటాప్ స్టోరీస్విజ‌య్ హీరోయిన్‌కు మ‌రో ఛాన్స్‌!

విజ‌య్ హీరోయిన్‌కు మ‌రో ఛాన్స్‌!

Ritu varma re entaring to Tollywood
Ritu varma re entaring to Tollywood

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `పెళ్లిచూపులు` చిత్రం ఎలాంటి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమా విజ‌యంతో హీరో విజ‌య్ కెరీర్ మారిపోయింది కానీ అందులో న‌టించిన రితూ వ‌ర్మ మాత్రం ఆ స్థాయిలో అవ‌కాశాల్ని మాత్రం పొంద‌లేక‌పోయింది. నిఖిల్‌తో `కేశ‌వ‌` చిత్రంలో న‌టించిన రీతూ ఆ త‌రువాత విక్ర‌మ్, గౌత‌మ్ మీన‌న్‌ల చిత్రం `దృవ‌న‌క్ష‌త్రం`లో అవ‌కాశం రావ‌డంతో త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిపోయింది.

విదేశాల్లో చిత్రీక‌ర‌ణ కార‌ణంగా అనుమ‌త‌లు ఆల‌స్యం కావ‌డంతో చిత్రీక‌ర‌ణ డిలే అయింది. గ‌త రెండేళ్లుగా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఈ సినిమా వుండిపోవడంతో కోటి ఆశ‌ల‌తో ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట‌రైన రీతూ నిరుత్సాహానికి గురైంది. కెరీర్ ప‌రంగా ఈ సినిమా కార‌ణంగా వెన‌క‌బ‌డిపోయింది. ఈ సినిమా రిలీజ్ వ‌ర‌కు వేచి చూసి అల‌సిపోయిన రీతూ వ‌ర్మకు తాజాగా ఓ తెలుగు సినిమా ఆఫ‌ర్ ల‌భించింది.

- Advertisement -

త‌మిళ న‌టుడు అశోక్ సెల్వ‌న్ తెలుగు తెర‌కు హీరోగా ప‌రిచ‌యం కాబోతున్న ఈ చిత్రాన్ని అని శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. రీతూ వ‌ర్మ‌తో పాటు ఈ చిత్రంలో నిత్యామీన‌న్ కూడా ఓ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఓ చెఫ్‌కు సంబంధించిన క‌థ‌గా ఈ చిత్రాన్ని రూపొందించ‌బోతున్నారు. మ‌రి ఈ సినిమాతో అయినా రితూ వ‌ర్మ కెరీర్ మ‌ళ్లీ తెలుగులో ఊపందుకుంటుదేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All