అగ్ర నిర్మాత సురేష్ బాబు ని 4 లేదా 5 కోట్ల కు బ్లాక్ మెయిల్ చేయాలనీ కుట్ర చేసాడట దర్శకులు రాంగోపాల్ వర్మ ఈ విషయాన్నీ తానే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించాడు . వివాదాస్పద నటి శ్రీరెడ్డి సురేష్ బాబు తనయుడు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేసి ఓ స్టూడియో లో అభిరామ్ నాపై అత్యాచారం చేసాడని ఆరోపించిన విషయం తెలిసిందే . ఆ సంఘటన సంచలనం సృష్టించింది దాంతో సురేష్ బాబు తలెత్తు కోలేక పోయాడు .
ఈ విషయాన్నీ రాజీ కుదుర్చడానికి రాంగోపాల్ వర్మ మధ్యవర్తిత్వం వహించాడట . శ్రీరెడ్డి కి సురేష్ బాబు నుండి 4 లేదా 5 కోట్ల ని ఇప్పిస్తానని ఇక ఈ విషయంపై రాద్ధాంతం చేయొద్దని శ్రీరెడ్డి కి చెప్పాడట అయితే తన పోరాటం ఒక్క అభిరామ్ మీద కాదని డబ్బు తీసుకునే ఉద్దేశ్యం లేదని శ్రీరెడ్డి చెప్పిందని అందుకే ఆమె పోరాటానికి ముగ్దుడనయ్యానని అంటున్నాడు రాంగోపాల్ వర్మ .