కొరియన్ చిత్రాలని ఫ్రీమేక్లు చేసి భారీగానే లాభాల్ని ఆర్జించిన మన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, అండ్ డైరెక్టర్స్ `బాహుబలి` తరువాత కొరియన్ మూవీస్ హక్కుల్ని సొంతం చేసుకుని మరీ తెలుగులో వాటిని రీమేక్ చేస్తున్నారు. సక్సెస్లు సాధిస్తున్నారు. ఇటీవల `ఓ బేబీ`ని కొరియన్ హిట్ ఫిల్మ్ `మిస్ గ్రానీ` ఆధారంగా సమంతతో తెరకెక్కించి సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ యిద్దరు మరో కొరియన్ మూవీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. అదే మిడ్నైట్ రన్నర్స్`. 2017 ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రెజీనా కీలక పాత్రలో నటిస్తోంది.
`స్వామి రారా` ఫేమ్ సుధీర్వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. `ఓ బేబీ` సూపర్ హిట్ కావడంతో తాజా కొరియెన్ రీమేక్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. యాక్షన్ కామెడీగా రూపూఒందుతున్న ఈ మూవీ కోసం ఓ విచిత్రమైన టైటిల్ని మేకర్స్ ఫైనల్ చేశారు. అదే `షాకినీ ఢాకినీ`. టైటిల్ విన్నవారంతా ఇదేం టైటిల్ బాబోయ్ అంటున్నారు.