Homeన్యూస్సెన్సార్ పూర్తి చేసుకున్న 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం' ఫిబ్రవరి ౩న విడుదల

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ఫిబ్రవరి ౩న విడుదల

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం' ఫిబ్రవరి ౩న విడుదల
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ఫిబ్రవరి ౩న విడుదల

ఆడియెన్స్ సినిమాలను చూసే ధోరణి మారిపోయింది. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు.

ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్య రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది.

- Advertisement -

2 నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న టీజర్‌లో డైలాగ్స్, విజువల్స్, నటీనటుల పర్ఫామెన్స్‌ ఇలా అన్నీ కూడా జనాలను ఆకట్టుకున్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ ఈ సినిమాకు పని చేయడం విశేషం. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఎంతో గొప్పగా ఈ చిత్రాన్ని తీశారని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో అన్ని కారెక్టర్లను చూపించారు. పోస్టర్‌ ఎంతో ఇంటెన్స్ గా కనిపిస్తోంది. దర్శకుడు జైదీప్ విష్ణు ఈ సినిమాకు ఎడిటర్‌గానూ పని చేశారు. ఈ సినిమాకు సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేశారు.

సాంకేతిక బృందం
డైరెక్టర్: జైదీప్ విష్ణు
బ్యానర్: వారధి క్రియేషన్స్ ప్రై.లి.
మ్యూజిక్: మణిశర్మ
DOP: శ్రీకాంత్ అర్పుల
ఎడిటింగ్: జైదీప్ విష్ణు
కథ, కో డైరెక్టర్ : సంతోష్ మురారికర్
PRO: సాయి సతీష్, పర్వతనేని

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All