Homeగాసిప్స్భీష్మ వాయిదా పడటానికి కారణం అదేనా?

భీష్మ వాయిదా పడటానికి కారణం అదేనా?

భీష్మ వాయిదా పడటానికి కారణం అదేనా?
భీష్మ వాయిదా పడటానికి కారణం అదేనా?

నితిన్ హ్యాట్రిక్ ప్లాపులు చవిచూడడంతో ఎటువంటి సినిమా చేయాలో తెలియక దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా గడిపేశాడు. ఈ కాలంలో కనీసం కథలు కూడా వినలేదు. తనకు ఎటువంటి చిత్రాలు సూట్ అవుతాయోనన్న క్లారిటీ వచ్చిన తర్వాత ఒప్పుకున్న మొదటి సినిమా భీష్మ, ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల భీష్మ సినిమాను తన రెండో ప్రయత్నంగా తెరకెక్కిస్తున్నాడు. భీష్మ ఒప్పుకున్న కొన్ని రోజులకే నితిన్ వరసగా రంగ్ దే, చంద్రశేఖర్ యేలేటి చిత్రాలను కూడా లైన్లో పెట్టాడు. రంగ్ దే సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. తొలిప్రేమతో భారీ విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి, mr మజ్ను సినిమాతో డీలా పడ్డాడు. మళ్ళీ ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చేస్తున్న ప్రయత్నం రంగ్ దే. ఈ మూడు సినిమాలే అనుకుంటే నితిన్ కృష్ణ చైతన్యతో పవర్ పేట అనే చిత్రాన్ని కూడా సెట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆఖర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.

ఇక మళ్ళీ భీష్మ విషయానికి వస్తే ఈ చిత్రానికి ఫరెవర్ సింగిల్ అనే క్యాప్షన్ ను జతచేసి సినిమాపై ఆసక్తి అమాంతం పెంచేశారు. యూత్ కు ఎక్కువ కనెక్ట్ అయ్యే కథాంశం కావడంతో నితిన్ కూడా భీష్మపై ధీమాగా ఉన్నాడు. అందులోనూ నితిన్ కెరీర్ లోనే ఎన్నడూ చేయనంత కామెడీ ఈ సినిమాలో చేసాడట. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అవనుందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడే ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్న ప్రకారం షెడ్యూల్స్ జరగకపోవడంతో ఇప్పుడీ చిత్రాన్ని ఫిబ్రవరికి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మోస్ట్లీ ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల అవుతుందని అంటున్నారు.

- Advertisement -

అంతే కాకుండా వెంకీ కుడుములకు ఫిబ్రవరి సెంటిమెంట్ కూడా ఉంది. తన తొలి చిత్రం ఛలో కూడా ఫిబ్రవరిలోనే విడుదలై సంచలన విజయం సాధించింది. అందుకే ఈ రెండు కారణాల వల్ల భీష్మను కూడా ఇప్పుడు ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.అసలే ప్లాప్స్ లో ఉన్న నితిన్ కు ఈ చిత్రమైనా ఊరట కలిగిస్తుందేమో చూడాలి. ఇప్పుడు భీష్మ ఫిబ్రవరికి మూవ్ అయిపోవడంతో 2019లో నితిన్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాదని తేలిపోయింది. అయితే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి నితిన్ 2020లో కుదిరితే రెండు, లేదంటే మూడు చిత్రాలను విడుదల చేయాలని భావిస్తున్నాడు.

ఫిబ్రవరిలో భీష్మ విడుదల కానుంది, అయితే జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా నితిన్ రంగ్ దే షూటింగ్ లో పాల్గొంటాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. కాబట్టి వేగంగా షూటింగ్ ను పూర్తి చేసి వేసవి చివరికి అంటే జూన్ లేదా జులైలో రంగ్ దేను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత చంద్రశేఖర్ యేలేటితో చిత్రాన్ని మొదలుపెడతాడు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All