Homeగాసిప్స్రవితేజ టచ్ చేసి చూడు ఎలా ఉందో తెలుసా

రవితేజ టచ్ చేసి చూడు ఎలా ఉందో తెలుసా

ఈరోజు మాస్ మహరాజ్ రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రం విడుదల అయ్యింది. అయితే ఓవర్ సీస్ లో మాత్రం నిన్న రాత్రి టచ్ చేసి చూడు ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆ షోల ప్రకారం రవితేజ సినిమా టాక్ ఏంటో తెలుసా……. జస్ట్ యావరేజ్ సినిమా అని. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి నిర్మించిన ఈ చిత్రం ఫస్టాఫ్ సాదా సీదా లా ఉండగా సెకండాఫ్ అయినా బాగుంటుంది అని ఆశించిన వాళ్లకు నిరాశే ఎదురైందట.
కాకపోతే గుడ్డిలో మెల్ల ఏంటంటే రవితేజ రాశి ఖన్నా, సీరత్ కపూర్ లతో చేసే రొమాన్స్ ప్రేక్షకులకు కాస్త ఆనందాన్ని ఇస్తుందట అలాగే రవితేజ మార్క్ నటన బాగుందట . మొత్తానికి రవితేజ టచ్ చేసి చూడు అనుకున్న స్థాయిలో లేదని నల్లమలుపు బుజ్జి కి మరో ప్లాప్ వచ్చినట్లే అని అంటున్నారు. ఓవర్ సీస్ టాక్ అలా ఉండగా ఇక తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All