Homeటాప్ స్టోరీస్నిర్మాత‌గా మారుతున్న మాస్ మ‌హారాజా!

నిర్మాత‌గా మారుతున్న మాస్ మ‌హారాజా!

Raviteja planning a production company
Raviteja planning a production company

గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో మాస్ మ‌హారాజా మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు. ఈ సంక్రాంతికి బ‌రిలోకి దిగిన ఈ చిత్రం సాలీడ్ ఫిగ‌ర్స్‌ని బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూలు చేసి ర‌వితేజ చిత్రాల్లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. `క్రాక్‌` హిట్‌తో మాంచి జోష్ మీదున్న ర‌వితేజ తాజాగా సొంత నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించ‌బోతున్నార‌ని తెలిసింది.

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి ద‌గ్గ‌రి నుంచి నేచుర‌ల్ స్టార్ నాని.. మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్‌ వ‌ర‌కు చాలా మంది హీరోల‌కు సొంత నిర్మాణ సంస్థ‌లున్నాయి. కానీ మాస్ రాజా ర‌వితేజ‌కు మాత్రం సొంత నిర్మాణ సంస్థ లేదు. కెరీర్ ప‌రంగా ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనూ అస్స‌లు త‌గ్గ‌డం లేదు దీంతో భారీ స్థాయిలోనే ఆస్తులు కూడ‌బెట్టిన ఆయ‌న సొంతంగా త‌న పేరు క‌లిసి వ‌చ్చేలా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీని ప్రారంభించ‌బోతున్నార‌ట‌.

- Advertisement -

`ఆర్‌టీ వ‌ర్క్స్‌` అనే పేరుతో ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ని ప్రారంభించి కొత్త టాలెంట్‌ని ప్రోత్స‌హించాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ర‌వితేజ `ఖిలాడీ` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో మాస్ రాజా తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All