మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ప్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. వరస ప్లాపులతో పూర్తిగా దెబ్బత్తిన్న రవితేజ ప్రస్తుతం తన దృష్టాంతా డిస్కో రాజా సినిమాపైనే పెట్టాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సెప్టెంబర్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఈ వినూత్న కథకు విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే డిస్కో రాజా తర్వాత రవితేజ తన తర్వాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన సంగతి తెల్సిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి. ఇది కాకుండా సుధీర్ వర్మ దర్శకత్వంలో కూడా రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
అసలు రణరంగం సినిమా మొదట రవితేజాతోనే చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల సుధీర్ వర్మ, శర్వానంద్ తో ముందుకు వెళ్ళాడు. మరి ఈ మూడు సినిమాలతో మాస్ మహారాజ్ తన పూర్వపు ఫామ్ ను అందుకుంటాడా అన్నది చూడాలి.