ఒక్క హిట్టు పడితే పారితోషికాలు పెంచేయడం కామనే. మాస్ మహారాజా రవితేజ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. గత కొంత కాలంగా సాలీడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు `క్రాక్`తో బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ రోజు కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా ఫస్ట్ షోతో మంచి టాక్ని సొంతం చేసుకుంది.
ఆ తరువాత సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో విన్నర్గా నిలిచి ఫస్ట్ ప్లేస్ని కొట్టేసింది. ఇప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ స్టడీగా వున్నాయి. దీంతో మాస్ రాజా రవితేజ తన పారితోషికాన్ని 12 నుంచి 14 కోట్లకు పెంచినట్టు తెలుస్తోంది. అదీ వితౌట్ జీఎస్టీ మాత్రమే జీఎస్టీతో కలిపి 16 కోట్లవుతోందట. `క్రాక్` చిత్రం థియేట్రికల్ రిలీజ్కి ముందే 20 నుంచి 26 కోట్లకు బిజినెస్ జరిగింది.
దీంతో తన పారితోషికాన్ని రవితేజ భారీగా పెంచేశారట. గత కొంత కాలంగా హిట్లు లేకపోవడంతో 10 నుంచి 12 కోట్లు మాత్రమే తీసుకున్న రవితేజ తాజాగా `క్రాక్` హిట్తో తన పారితోషికాన్ని ఏకండా జీఎస్టీతో కలిపి 16 కోట్లకు పెంచినట్టు తెలిసింది. ఇది నిర్మాతలకు భారమే అయినా రవితేజ ట్రాక్ రికార్డుకిది తక్కువే అంటున్నారు.