
మాస్ మహారాజా రవితేజ చేస్తున్న చిత్రాలలో టైగర్ నాగేశ్వరరావు ఒకటి. వంశీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ దొంగ జీవిత చరిత్రగా, 1970 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రవితేజ ఈ సినిమా కోసం తన మేకోవర్ ను మార్చుకోబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా.. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రం కోసం 70వ దశకం నాటి స్టూవర్టుపురంను తలపించేలా భారీ సెట్ను నిర్మిస్తోంది చిత్ర బృందం. శంషాబాద్ సమీపంలోని 5ఎకరాల విస్తీర్ణంలో… దాదాపు రూ.7కోట్ల ఖర్చుతో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా పర్యవేక్షణలో ఈ భారీ సెట్ను నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక ఎపిసోడ్లన్నీ ఇందులోనే చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఇక ఈ మూవీ లో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు గా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.