Homeగాసిప్స్రవితేజ మూడు పాత్రలు పోషించనున్నాడట

రవితేజ మూడు పాత్రలు పోషించనున్నాడట

మాస్ మహారాజ్ తాజాగా టచ్ చేసి చూడు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు కాగా దాని తర్వాత ఏప్రిల్ లో కొత్త సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు అది కూడా శ్రీను వైట్ల దర్శకత్వంలో . ఆగడు , బ్రూస్ లీ , మిస్టర్ చిత్రాలు వరుసగా డిజాస్టర్ అయి హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు శ్రీను వైట్ల దాంతో అతడి తో సినిమా చేయాలంటే హీరోలు భయపడుతున్నారు . అతడికి ఛాన్స్ ఇవ్వడానికి తీవ్ర తర్జన భర్జన పడుతున్న సమయంలో రవితేజ మాత్రం శ్రీను వైట్ల తో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు .

రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో నీ కోసం , వెంకీ , దుబాయ్ శీను లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి ఆ చిత్రాలు అటు శ్రీను వైట్ల ఎదగడానికి అలాగే రవితేజ ఎదగడానికి బాగా ఉపయోగ పడ్డాయి . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు . ఇక ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం పోషించనున్నాడట . అమర్ అక్బర్ ఆంటోనీ పాత్రలను పోషించనున్నట్లు తెలుస్తోంది . మరి ఈ సినిమా తోనైనా శ్రీను వైట్ల హిట్ కొడతాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All