Homeటాప్ స్టోరీస్ముంబైలో ల‌గ్జ‌రీ ఫ్లాట్ కొనేసింది!

ముంబైలో ల‌గ్జ‌రీ ఫ్లాట్ కొనేసింది!

rashmika mandanna to settle in bollywood
rashmika mandanna to settle in bollywood

`ఛ‌లో` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న‌. తొలి చిత్రం బారీ విజ‌యాన్ని సాధించ‌డంతో ర‌ష్మికకు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. ఆ త‌రువాత చేసిన `గీత గోవిందం` వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో ర‌ష్మిక స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ నాయిక‌గా స్టార్ డ‌మ్‌ని ద‌క్కించుకుని స్టార్ హీరోల చిత్రాల్లో అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటోంది.

మ‌హేష్‌తో `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో న‌టించిన ర‌ష్మిక ప్ర‌స్తుతం `పుష్ప‌`లో బ‌న్నీకి జోడీగా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇదే ఏడాది `మిష‌న్ మ‌జ్ను` పేరుతో రూపొందుతున్న హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే ఆమె చేసిన హిందీ సాంగ్ ఓ రేంజ్‌లో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా క‌న్న‌డ‌, తెలుగు ఫ్యాన్స్‌కి ర‌ష్మిక బ్యాడ్ న్యూస్ చెప్పేసింది.

- Advertisement -

అదేంటంటే తెలుగు, త‌మిళ భాష‌ల్లో మాంచి రైజింగ్‌లో వున్న ర‌ష్మిక బాలీవుడ్‌కు మ‌కాం మార్చేలా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే ముంబైలో అత్య‌తం ఖరీదైన విల్లాని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి `డాడీ` చిత్రంలోనూ న‌టించే అవ‌కాశం రావ‌డంతో ర‌ష్మిక త‌న మ‌కాంని ముంబైకి మార్చ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All