కన్నడ బ్యూటీ రష్మిక మందన్న చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కు చేరుకుంది. ఆనతి కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో టాప్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అటు నుండి ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతోన్న మిషన్ మజ్నులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న గుడ్ బైలో కీలక పాత్ర పోషిస్తోంది.
తెలుగులో కూడా అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్పలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే శర్వానంద్ హీరోగా వస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో కూడా ఈమే హీరోయిన్.
ఇలా వరస అవకాశాలతో దూసుకుపోతోన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా టాప్ ప్లేస్ కు చేరుకుంది. సౌత్ నటుల్లో రష్మిక మందన్న మోస్ట్ ఫాలోయడ్ సెలబ్రిటీ అయింది. ఇన్స్టాగ్రామ్ లో కాజల్, సమంతలను క్రాస్ చేసి నెం 1 గా నిలిచింది. కాజల్ కు 19.1 మిలియన్ ఫాలోయర్స్ ఉంటే సమంతకు 17.6 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని తోసి రష్మిక 19.4 మిలియన్ ఫాలోయర్స్ తో టాప్ ప్లేస్ కు చేరుకుంది.