అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ మూవీ `పుష్ప`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ దశలో వుంది. మైత్రీ మూవీ మేకర్స్తో పాటు ముత్యం శెట్ట మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మక మందన్న నటిస్తోంది. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానపుంది.
ఈ మూవీ షూటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది హీరోయిన్ రష్మిక మందన్న. అల్లు అర్జున్తో కలిసి పనిచేయడం చాలా స్పెషల్గా వుంది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మంచి వ్యక్తి. అయితే మనసు పరంగా మాత్రం చిన్న పిల్లవాడు. ఆన్ స్క్రీన్లో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆయనతో కలిసి నటించడం సులభమే`అని తెలిసింది.
`పుష్ప` మూవీ గురించి మాట్లాడుతూ `ఇప్పటి వరకూ నేను చేసిన చిత్రాల్లో `పుష్ప` ఎంతో విభిన్నమైన చిత్రం`. సుదూర ప్రాంతాల్లో చిత్రీకరణ కారణంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. తెల్ల వారుజామున 4 గంటలకు నిద్ర లేచి లొకేషన్కు చేరుకుంటున్నాం. మళ్లీ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అవుతోంది. భోజనం, వర్కవుట్లు చేసి నిద్రపోయేసరిగి రాత్రి 12 నుంచి ఒంటిగంట అవుతోంది. దాని వల్ల కేవలం నాలుగు గంటలే నిద్రపోతున్నాను. నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు స్క్రీన్పై చూస్తారు` అని వెల్లడించింది రష్మిక.