`వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంతో ఈ ఏడాది ప్రారంభంలోనే డిజాస్టర్ ని సొంతం చేసుకుంది రాశిఖన్నా. గత ఏడాద `ప్రతిరోజు పండగే`తో సాలీడ్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నా ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లాప్ని చవిచూడటంతో రేస్లో వెనకబడింది. ప్రస్తుతం తమిళంలో రెండు థ్రిల్లర్ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సిద్ధార్ధ్ హీరోగా నటిస్తున్న `పైతాన్ కా బచ్చా`.
మరొకటి సుందర్ సి. `అరన్మనై 3`. ఈ రెండూ చిత్రీకరణ దశలో వున్నాయి, సూర్య హీరోగా హరి తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రానికి `అరువా` అనే టైటిల్ని ఖరారు చేశారు. ఇదే చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా వుంటే తెలుగులో త్వరలో రెండు చిత్రాల్లో నటించబోతున్ననని వెల్లడించింది. తాజాగా ఓ మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
ప్రేమించి మాత్రమే పెళ్లి చేసుకుంటానని పెప్పిన రాశిఖన్నా తెలుగులో మాత్రం ఇద్దరు స్టార్ హీరోలపై కన్నేసింది. మహేష్బాబు, అల్లు అర్జున్లతో కలిసి నటించాలని వుందని, ఆ ఛాన్స్ కోసమే ఎదురుచూస్తున్నానని, ఆ కల త్వరలోనే నెరవేరే అవకాశం వుందని హింట్ ఇచ్చేసింది.