రాంచరణ్ నటించిన రంగస్థలం 175 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది , ఇక 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది . మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఈనెల 20 న భారీ ఎత్తున విడుదల అవుతోంది . అంటే మరో రెండు రోజుల పాటు రంగస్థలం కు ఎదురే లేదు , మహేష్ సినిమా వచ్చిన రోజున కొంత ఇబ్బంది చరణ్ కు ఆ సినిమా బాగుంటే రంగస్థలం వసూళ్ల పై ప్రభావం చూపుతుంది అయితే భరత్ అనే నేను సినిమా బాగోలేకపోతే మాత్రం రంగస్థలం ప్లస్ అవుతుంది .
మొత్తానికి మరో రెండు రోజుల గ్యాప్ ఉంది కాబట్టి చరణ్ రంగస్థలం కు వచ్చిన డోఖా లేదు దాంతో 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది . చరణ్ అద్భుత నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది . అలాగే సమంత యాక్టింగ్ సుకుమార్ డైరెక్షన్ వెరసి రంగస్థలం ని బ్లాక్ బస్టర్ గా నిలిపాయి .
- Advertisement -