మార్చి 30 న విడుదలైన రంగస్థలం రికార్డుల మోత మోగిస్తోంది . ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా పయనిస్తూ నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . చరణ్ – సమంత జంటగా నటించిన ఈ చిత్రం చరణ్ కెరీర్ లో మరో మైలురాయి గా నిలిచింది . బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడం , రంగస్థలం చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లు వస్తున్నాయి .
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం ఓవర్ సీస్ లో సైతం భారీ వసూళ్ల ని సాధిస్తోంది . విడుదలైన అన్ని కేంద్రాల్లో కూడా సంచలన విజయం సాధిస్తోంది ఈ చిత్రం . రంగస్థలం చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తుండటంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు . ఇక ఈ చిత్రాన్ని పలు భాషలలో రీమేక్ చేయడానికి , డబ్బింగ్ చేయడానికి పోటీ పడుతున్నారు .