మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన రంగస్థలం 34 రోజుల్లో 200 కోట్ల పై చిలుకు వసూళ్ల ని సాధించింది . మార్చి 30న భారీ ఎత్తున విడుదలైన రంగస్థలం మొదటి రోజునే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది దానికి తోడూ వేసవి సెలవులు కూడా తోడవ్వడంతో భారీ వసూళ్ల ని సాధించి నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించింది . ఇక చరణ్ సరసన సమంత నటించింది . హాట్ భామ అనసూయ రంగమ్మత్త గా నటించిన రంగస్థలం 34 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 88 కోట్లకు పైగా షేర్ సాధించింది . రెండు తెలుగు రాష్ట్రాలలో రంగస్థలం సాధించిన షేర్ వసూళ్లు ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి .
నైజాం – 27. 11 కోట్లు
సీడెడ్ – 17. 37 కోట్లు
కృష్ణా – 6. 79 కోట్లు
గుంటూరు – 8. 17 కోట్లు
ఈస్ట్ – 7. 48 కోట్లు
వెస్ట్ – 5. 92 కోట్లు
ఉత్తరాంధ్ర – 12. 78 కోట్లు
నెల్లూరు – 3. 28 కోట్లు
మొత్తం – 88. 9 కోట్లు