Homeటాప్ స్టోరీస్"సామజవరగమన"ను మించి "రాములో రాముల".. సౌత్ ఇండియాలోనే టాప్

“సామజవరగమన”ను మించి “రాములో రాముల”.. సౌత్ ఇండియాలోనే టాప్

"సామజవరగమన"ను మించి "రాములో రాముల".. సౌత్ ఇండియాలోనే టాప్
“సామజవరగమన”ను మించి “రాములో రాముల”.. సౌత్ ఇండియాలోనే టాప్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ చిత్ర షూటింగ్ ఒక వైపు శరవేగంగా సాగుతుండగా మరోవైపు ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో సాగుతున్నాయి. చిత్రాన్ని జనాల్లో ఉంచాలని సినిమా రిలీజ్ కు నాలుగు నెలల ముందు నుండే ప్రమోషన్స్ ను దంచి కొడుతున్నారు. నెల క్రితమే తొలి పాట సామజవరగమన పాటను విడుదల చేయగా అది యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే 56 మిలియన్ వ్యూస్ దాటి 100 మిలియన్ వ్యూస్ వైపు పరుగులు పెడుతోంది. లైక్స్ విషయంలో కూడా ఈ పాట పాత రికార్డులను తిరగరాస్తోంది. ఏ ఉద్దేశంతో అయితే ఇంత ముందర ఒక పాటను విడుదల చేసారో ఆ లక్ష్యాన్ని ఈ పాట అందుకుంది.

ఇక దీపావళి సందర్భంగా విడుదలైన రెండో పాట రాములో రాముల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. తొలి పాట బ్లాక్ బస్టర్ హిట్ కాగా, తొలి పాటను మించి రెండో సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. సమజవరగమన తిరగరాసిన రికార్డులను దాటి ఈ పాట దూసుకుపోతోంది. విడుదలైన 24 గంటల్లో ఈ పాట దాదాపు 8.3 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ 24 గంటల్లో మోస్ట్ వ్యూడ్ సాంగ్ గా కొత్త రికార్డును సెట్ చేసింది. లైక్స్ పరంగా కూడా ఇప్పటికే 340K ను లైక్స్ వచ్చాయి. ఒక పాట అంత పెద్ద హిట్ అయ్యాక దాన్ని మించేలా మరో పాట ఉండటం నిజంగా విశేషమే. సామజవరగమన పూర్తిగా క్లాస్ సాంగ్ కాగా, రాములో రాముల పార్టీ సాంగ్. మాస్ టచ్ తో సాగే ఈ సాంగ్ ప్రేక్షకులకు తొలిసారి విన్న దగ్గరనుండే బాగా నచ్చేస్తోంది. అందుకే రిపీట్ లో ఈ పాటను తెగ వింటున్నారు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వాయిస్ లు కూడా ఈ పాటకు కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక కాసర్ల శ్యామ్ రాసిన క్యాచీ లిరిక్స్ పాటకు అసలైన ఆకర్షణగా మారాయి. మొత్తానికి ఈ రెండు పాటలు ఇంత పెద్ద హిట్ అవ్వడంతో అల వైకుంఠపురములో టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది.

- Advertisement -

బయ్యర్లలో ఇప్పుడు ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. పైగా సినిమా మీద కూడా నమ్మకం ఏర్పడింది. దాంతో ఇప్పటినుండే బిజినెస్ ఆఫర్లు మొదలైపోయాయి. అయితే అల వైకుంఠపురములో టీమ్ ఎక్కడా హడావిడి లేకుండా డీల్ చేయాలనుకుంటోంది. సినిమా రిలీజ్ కు ఇంకా రెండున్నర నెలల సమయం ఉండడంతో డిసెంబర్ నుండి బిజినెస్ ను ఓపెన్ చేయాలని భావిస్తోంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సుశాంత్, నివేద పేతురాజ్, నవదీప్, సునీల్, హర్షవర్ధన్, మురళి శర్మ, సచిన్ కెద్కర్, జయరామ్ తదితరులు నటిస్తున్నారు. టబు ఈ చిత్రంతో చాలా ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమాల్లో కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా అల్లు అరవింద్, చినబాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All