వినయ విధేయ రామ చిత్రంతో బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు దాంతో వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు హీరో రాంచరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన చిత్రం వినయ విధేయ రామ. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం పొందింది. దాంతో బయ్యర్లకు 30 కోట్ల నష్టం వాటిల్లింది.
- Advertisement -
తన సినిమాతో బయ్యర్లు ఘోరంగా నష్టపోవడంతో వాళ్ళని ఆదుకోవాలని డిసైడ్ అయ్యాడట చరణ్ అందుకే తనవంతుగా 5 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చాడట. ఇక నిర్మాత డివివి దానయ్య కూడా మరో 5 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అయితే బోయపాటి శ్రీను మాత్రం ఇంకా స్పందించలేదు .
English Title: Ramcharan support to VVR buyers
- Advertisement -