Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన చరణ్

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన చరణ్

ramcharan-pawankalyan-janasena
బాబాయ్ పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురికావడంతో అతడ్ని పరామర్శించడానికి విజయవాడ వెళ్ళాడు అబ్బాయ్ రాంచరణ్ . ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రచారం చేస్తున్న సమయంలో తీవ్ర వడదెబ్బకు గురయ్యాడు పవన్ కళ్యాణ్ . దానికి తోడు చేతికి గాయం కూడా కావడంతో డాక్టర్ల సలహా మేరకు విజయవాడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు పవన్ . దాంతో బాబాయ్ ని పరామర్శించడానికి విజయవాడ వెళ్ళాడు అబ్బాయ్ చరణ్ . 
 
బాబాయ్ ని పరామర్శించి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత విజయవాడ నుండి గుంటూరు లోని మంగళగిరి లో గల జనసేన పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు గడిపి అక్కడి నుండి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు చరణ్ . అయితే చరణ్ కు కూడా కాలికి దెబ్బ తగలడంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి మూడు వారాల గ్యాప్ ఇచ్చాడు . కాలికి పట్టీ వేసుకునే బాబాయ్ ని పలకరించడానికి వెళ్ళాడు చరణ్ . రేపటితో ప్రచారం ముగియనుంది . దాంతో ఈ రెండు రోజులు కీలకం కానున్నాయి రాజకీయ పార్టీలకు . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All