మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో ఉన్నాడు. గత ఏడాది క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలను లైన్లో పెట్టాడు. రీసెంట్ గా ఖిలాడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ప్రేక్షకుల అంచనాలు అందుకోలేపోయాడు. అయినప్పటికీ ఏమాత్రం జోష్ తగ్గించుకోకుండా తదుపరి సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వాటిలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి.
నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్ , రజిష విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ను ఫ్యాన్స్ కు అందజేసింది చిత్ర యూనిట్. రేపు ఉదయం 10.08 గంటలకు ఓ భారీ అప్ డేట్ను అందించనున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మరి అది సినిమా రిలీజ్ డేట్ కావొచ్చని అంత భావిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.