Homeటాప్ స్టోరీస్కరోనాతో కామెడీ చేస్తున్నాడుగా!

కరోనాతో కామెడీ చేస్తున్నాడుగా!

కరోనాతో కామెడీ చేస్తున్నాడుగా!
కరోనాతో కామెడీ చేస్తున్నాడుగా!

ప్ర‌పంచం క‌రోనా పేరు చెబితే వ‌ణికిపోతోంది. ఏ దేశం వార్త‌లు విన్నా కరోనా మ‌ర‌ణాలే అధికం. ప్ర‌పంచ‌లోని ఏ మూల‌.. ఏ వార్త విన్నా క‌రోనా.. క‌రోనా.. చైనా దేశంలోని పుహాన్‌లో ఒక్క‌డు చేసిన త‌ప్పుకి యావ‌త్ ప్ర‌పంచం మూల్యం చెల్లిస్తోంది. ఎక్క‌డో గ‌బ్బ‌ళాన్ని తిన్న ఓ న‌ర‌రూప రాక్ష‌సుడి కార‌ణంగా ప్ర‌పంచం మొత్తం వైర‌స్ భారిన ప‌డి వ‌ణిరిపోతోంది.

దీని ప్ర‌భావం ఇప్పుడిప్పుడే భార‌త్‌లో మొద‌లైంది. రాష్ట్రాల్లో ప‌రిస్థితి అదుపులోకి వ‌స్తోంది అని అనుకునే స‌మ‌యంలోనే ఢిల్లీ నిజాముద్దీన్ వెళ్లొచ్చిన వారి కార‌ణంగా యావ‌త్ దేశం ప్ర‌మాదంలో ప‌డిపోయింది. అప్ప‌టి దాకా రెండంక‌లే లెక్క‌ల్లో వున్న కేసుల‌న్నీ ఇప్పుడు మూడంకెలు దాటి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్నాయి. ఇదిలా వుంటే వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ ఈ స‌మ‌యాన్ని కామెడీ చేస్తూ ప‌బ్లిసిటీ చేసుకుంటున్నాడు.

- Advertisement -

బుధ‌వారం రాత్రి 9:37కు త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు డాక్ల‌ర్లు ప్ర‌క‌టించార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించి నెటిజ‌న్స్‌కి షాకిచ్చాడు. ఆ వెంట‌నే  9:51 గంట‌ల‌కు మ‌రో ట్వీట్ చేశాడు. సారీ మిమ్మ‌ల్ని నిరుత్సాహ‌ప‌రిచాను. ఇది ఏప్రీల్ ఫూల్ జోక్ అని డాక్ట‌ర్లు చెప్పారు. అది డాక్ల‌ర్ల ఫాల్ట్‌. నాది కాదు. అని త‌న కుళ్లు .ఓకుతో డాక్ల‌ర్ల‌ని అవ‌మానించాడు. దీంతో నెటిజ‌న్స్ వ‌ర్మ‌పై మండిప‌డుతున్నారు.
క‌రోనాని కూడా నీ ప‌బ్లిసిటీ పిచ్చికి వ‌ద‌ల‌వా? అంటూ చివాట్లు పెడుతున్నారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All