నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 40కోట్లతో నిర్మించిన యు ఎఫిక్ మల్టీ ప్లెక్స్ దియేటర్స్ ను మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ నెల 29న ప్రారంభించనున్నారు.
29 ఉదయం హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లి అక్కడనుండి సూళ్లూరుపేటకు రాంచరణ్ చేరుకుంటారు. ఈ కార్యక్రంలో కృష్ణం రాజు, నిర్మాతలు వంశీ, ప్రమోద్ పాల్గొంటారు. మొత్తం మూడు స్క్రీన్ లు ఏర్పాటు చేసారు. మొదటి దాంట్లో 650 మంది సీటింగ్ కెపాసిటీకాగా మిగిలిన రెండు 140 మంది కుర్చునేట్లుగా ఈ స్క్రీన్లను ఏర్పాటు చేసారు.
అత్యాధునిక సౌకర్యాలతో తొలిసారిగా సీటుకింద సబ్ ఊపర్ లను అమర్చి 4కె రిజల్యూషన్తో వీక్షకులకు కనుల విందు కలిగేట్లుగా ఈ థియేటర్స్ ను తీర్చిదిద్దారు. ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ ఇది. 100అడుగుల వెడల్పు, 54అడుగుల ఎత్తు కలిగి వున్న ఈ థియేటర్స్ లో మొదటిసారిగా సాహో చిత్రాన్ని ప్రదర్శించనున్నారు..!