పవర్స్టార్ పవన్ కల్యాణ్ రెండేళ్ల విరామం తరువాత వరుస సినిమాలతో షాకిస్తున్న విషయం తెలిపిందే. వరుసగా మూడు నుంచి నాలుగు చిత్రాల్ని పవన్ లైన్లో పెట్టారు. ప్రస్తుతం `పింక్` రీమేక్, క్రిష్ జానపద చిత్రం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. మరో రెండు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పవర్స్టార్ తనయుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అతని కోసం పవన్ 5 కోట్లు విలువ చేసే ఓ లగ్జరీ ఫ్లాట్ని కొనుగోలు చేశాడని ప్రచారం మొదలైంది.
పూనేలో తల్లి రేణూదేశాయ్తో కలిసి వుంటుంన్న అకీరా, ఆధ్యా త్వరలోనే హైదరాబాద్కు షిప్ట్ కానున్నారని, ఆ తరువాతే అకీరా హీరోగా ఎంట్రీ వుంటుందని తెలుస్తోంది. అయితే అకీరాను హీరోగా పరిచయం చేసే బాధ్యతల్ని ఎవరు తీసుకున్నారు? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ బాధ్యతల్ని మెగా పవర్స్టార్ రామ్చరణ్ తీసుకున్నట్టు తెలిసింది.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై తండ్రి చిరంజీవి హీరోగా రామ్చరణ్ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్లోనే అకీరాను హీరోగా పరిచయం చేసే అవకాశం వుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే రానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ సినిమా ఎలా వుంటుంది. పవన్ స్టార్డమ్కి తగ్గట్టే అకీరా ఎంట్రీ వుంటుందా? అన్నది వేచి చూడాల్సిందే.