బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించి డ్రగ్స్ దర్యాప్తు కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ముందు కొన్ని నిమిషాల క్రిమే పిలిచిన రకుల్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు. సమన్లు అందిన వెంటనే గురువారం ముంబై వెళ్లిన రకుల్ సౌత్ ముంబైలోని కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్ హౌస్లో విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది.
విచారణకు హాజరయ్యే ముందు కారులో బయలు దేరిన రకుల్ బ్లూ జీన్స్ మరియు టీ షర్టు ధరించిన ఆమె ఎన్ 95 మాస్కు, కళ్లకి బ్లాక్ గాగుల్స్ ధరించి కనిపించింది. ముంబైలో జరిగిన ఈ కేసులో ఎన్సిబి అధికారులు పలువురు ప్రముఖులను ప్రశ్నిస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ లోనావాలాలోని సుశాంత్ సింగ్ రాజ్పుత్ కు సంబంధించిన ఫామ్హౌస్ లో జరిగిన వపార్టీలో పాల్గొందని, అక్కడ డ్రగ్స్ తీసుకుందంటూ జాతయ మీడియాలో కథనాలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన రకుల్ తను పిగరెట్లు తాగలేదని, తనకు అలాంటి అలవాటే లేదని స్పష్టం చేసింది.
రియా ఫోన్ చాట్ ఆధారంగా ఎన్సీబీ అధికారులు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు ప్రధానంగా హీరోయిన్ల పేర్లు బయటికి రావడం తెలిసిందే. ఆజా విచారణలో రకుల్, దీపిక, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ల పేర్లు బయటికి వచ్చినట్టు ప్రచారం జరిగింది. తాజాగా వారికే ఎన్సీబీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది.