ఆర్ఆర్ఆర్ టీం కు నైజాం డిస్టిబ్యూటర్ దిల్ రాజు సోమవారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఏర్పటు చేసిన ఈ పార్టీ కి ఆర్ఆర్ఆర్ టీం అంత హాజరయ్యారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు వారి కుటుంబ సమేతంగా హాజరవ్వడం విశేషం. ఈ ఈవెంట్ లో రాజమౌళి..డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కలిసి నాటు నాటు సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసి సక్సెస్ మీట్ లో హైలైట్ అయ్యారు.
మార్చి 25 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు రాబడుతూ వెయ్యి కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుంది. ఒక్క నైజాం ఏరియా లోనే దాదాపు 100 కోట్లను క్రాస్ చేసిందంటే ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుందో అర్ధం చేసుకుంది. నైజాం ఏరియా ను దిల్ రాజు రూ. 70 కోట్లకు దక్కించుకోగా..ప్రస్తుతం రూ. 100 కోట్లు క్రాస్ చేసినట్లు సమాచారం. నార్త్ లో కలెక్షన్లు రెట్టింపు అవ్వడం బాలీవుడ్ సినీ విశ్లేషకులను షాక్ కు గురి చేస్తుంది. గత రెండు వారాల్లో రిలీజ్ అయినా ఏ హిందీ చిత్రం కూడా ఆర్ఆర్ఆర్ ముందు నిలవలేకపోయింది. ఇప్పటికే ఇక్కడ 200 కోట్లు క్రాస్ చేసిందని అంటున్నారు.