Homeటాప్ స్టోరీస్రాజమౌళి వచ్చి కలిసినంత మాత్రన టికెట్ ధరలు మారవు - పేర్ని నాని

రాజమౌళి వచ్చి కలిసినంత మాత్రన టికెట్ ధరలు మారవు – పేర్ని నాని

దర్శక ధీరుడు రాజమౌళి తో పాటు నిర్మాత దానయ్య లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. భారీ బ‌డ్జెట్‌తో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి, ఈ సినిమా నిర్మాత దాన‌య్య‌తో క‌లిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకొని , అక్కడి నుండి నేరుగా తాడేప‌ల్లిలోని ఏపీ సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యానికి వెళ్లారు.

- Advertisement -

ఏపీలో ప్రత్యేక షోలు వేసుకునే వెసులుబాటుతో పాటు టిక్కెట్లు ధరల అంశంపై రాజమౌళి మాట్లాడినట్లు తెలుస్తుంది. కానీ సర్కార్ మాత్రం పెద్ద సినిమా రిలీజ్ టైం లో చిన్న సినిమా రిలీజ్ అయితే దానికి ఐదో షో కు అనుమతి తప్పనిసరి అన్నారు. టికెట్ ధరలు విషయంలో కూడా ప్రభుత్వం తీరు మారదని చెప్పినట్లు తెలుస్తుంది. రాజమౌళి కోరారని టికెట్ రేట్లు పెంచడం , తగ్గించడం వంటివి చేయలేమని చెప్పినట్లు వినికిడి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All