దర్శక ధీరుడు రాజమౌళి సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ లోని చార్మినార్ లో సందడి చేసారు. కొడుకు కార్తికేయతో కలిసి అర్థరాత్రి చార్మినార్ను సందర్శించాడు. సాధారణ వ్యక్తిలా వెళ్లి నైట్ నైట్ బజార్ అందాలను తిలకించారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు గుర్తుపట్టి రాజమౌళితో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక రంజాన్ మాసంలో అర్థరాత్రి దాటాక కూడా చార్మినార్లో షాపింగ్ సందడి కొనసాగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ సందడి ని చూసేందుకు రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ తో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ మూవీ మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ రెండు వారాలకే రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలై 25 రోజులు కావొస్తున్నా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ ఫుల్ కలెక్షన్లతో కొనసాగుతూనే ఉంది.