Homeటాప్ స్టోరీస్మన ఇద్దరి లోకం ఒక్కటే...

మన ఇద్దరి లోకం ఒక్కటే…

మన ఇద్దరి లోకం ఒక్కటే...
మన ఇద్దరి లోకం ఒక్కటే…

రాజ్ తరుణ్ హీరోగా, షాలిని పాండే హీరోయినా జి.ఆర్.కృష్ణ కొత్త దర్శకులుగా పరిచయం అవుతున్న సినిమా “ఇద్దరి లోకం ఒక్కటే”. నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రెయేషన్స్ (ఎస్.వి.సి) అధినేతలు దిల్ రాజు, శిరీష్ గారు. రేపు విజదశమి కానుకగా సినిమా గురించి మొదటి పోస్టర్ ని రిలీజ్ చేసారు.

షాలిని పాండే జోరుగా బండి నడుపుతుండగా, హీరోగా రాజ్ తరుణ్ వెనకాల కూర్చొని తనను చూస్తూ ఉన్నాడు. ‘యు ఆర్ మై హార్ట్ బీట్’ అని టాగ్ లైన్ కూడా ఉంది పోస్టర్లో. అయితే సినిమాల విషయంలో ఈ మధ్య తన పంధా మార్చుకున్న రాజ్ తరుణ్ చాలా కాలం తర్వాత చేస్తున్న సినిమా ఇది. హీరోయిన్ కూడా అర్జున్ రెడ్డి, 118 సినిమాలు హిట్ అయినా ఆనందం లో ఉంది ఇది తెలుగులో తనకి మూడవ సినిమా. మహానటి మరియు ఇంకా 2,3 సినిమాలో ఆలా వచ్చి ఇలా చేసిన పాత్రలు అయినా కూడా తనకి మెయిన్ హీరోయిన్ గా మాత్రం మూడవ సినిమా.

- Advertisement -

మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని ఎలాగైనా ఈ సంవత్సరం క్రిస్టమస్ వారికి విడుదల చెయ్యాలి అని ‘దిల్ రాజు’ గారు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా దిల్ రాజు సినిమాలు ఉన్నాయి కాబట్టి తన సినిమాలే తనకి భారం కాకూడదు అని ఇలా అనుకుంటున్నారు.

రాజ్ తరుణ్, షాలిని పాండే మరియు దర్శకులు జి.ఆర్.కృష్ణ కలిసి మొదటి సారి జతకడుతున్న సినిమా యువతరం ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All